రేపు ఉదయం 7.30 నుంచి 11గంటల వరకు
పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సీపీ సీవీ ఆనంద్
రాష్ట్ర అవతరణ వేడుకలకు నాంపల్లి పబ్లిక్గార్డెన్స్ ముస్తాబవుతోంది. సీఎం కేసీఆర్ ప్రసంగించే వేదిక, అతిథులు కూర్చొనే ప్రదేశం వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. గన్పార్కు అమరవీరుల స్తూపాన్ని కూడా అలంకరిస్తున్నారు.
సిటీబ్యూరో, మే 31(నమస్తే తెలంగాణ): పబ్లిక్ గార్డెన్లో జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉదయం 7.30 నుంచి 11 గంటల వరకు ఆయా పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ సందర్భంగా పబ్లిక్గార్డెన్ చుట్టుపక్కల ఉన్న జంక్షన్ల వద్ద నుంచి ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..!
తాజ్ ఐలాండ్: ఎంజేమార్కెట్ వైపు నుంచి పబ్లిక్ గార్డెన్కు వెళ్లే సాధారణ వాహనదారులను తాజ్ ఐలాండ్ వద్ద ఏక్మినార్, ఆసీఫ్నగర్, రెడ్హిల్స్, అయోధ్య హోటల్, లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు.
చాపెల్ రోడ్డు టీ జంక్షన్: నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వైపు వెళ్లే వాహనాలను చాపెల్ రోడ్డు జంక్షన్ వద్ద మళ్లిస్తారు. చాపల్ రోడ్డు, గన్ ఫౌండ్రి, అబిడ్స్ రోడ్డు, బషీర్బాగ్ రూట్లలో తమ
గమ్యస్థానాలకు చేరుకోవాలి.
ఓల్డ్ పీఎస్ సైఫాబాద్: నిరంకారి భవన్ అండ్ ఖైరతాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్ సైఫాబాద్ ఠాణా వద్ద టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, సచివాలయం గేట్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ, బషీర్బాగ్ వైపు వెళ్లాలి.
బషీర్బాగ్ జంక్షన్: హైదర్గూడ, కింగ్కోఠి, బీజేఆర్ విగ్రహం వైపు నుంచి పోలీస్ కంట్రోల్ రూం, పబ్లిక్గార్డెన్ వైపు వచ్చే వాహనాలను బషీర్బాగ్ జంక్షన్ నుంచి లిబర్టీ, తెలుగుతల్లి, ఎన్టీఆర్మార్గ్, ఇక్బాల్ మినార్, ఓల్డ్ సైఫాబాద్ ఠాణా, లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు.
ఇక్బాల్ మినార్: ట్యాంక్బండ్ నుంచి రవీంద్రభారతి వైపు వెళ్లే వాహనాలను టెలిఫోన్ భవన్, ఓల్డ్ సైఫాబాద్ ఠాణా, లక్డీకాపూల్ రూట్లో మళ్లిస్తారు.
ఏఆర్ పెట్రోల్ పంప్: సుజాత స్కూల్, గన్పౌండ్రి, బీజేఆర్ విగ్రహం వైపు నుంచి పబ్లిక్గార్డెన్కు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద బీజేఆర్ విగ్రహం కూడలి వైపు మళ్లిస్తారు.
ఆదర్శనగర్: తెలుగుతల్లి, ఎన్టీఆర్మార్గ్ వైపు నుంచి కంట్రోల్ రూం వైపు వచ్చే వాహనాలను ఆదర్శనగర్ జంక్షన్ వద్ద మళ్లిస్తారు.