ఎల్బీనగర్, జూన్ 6 : నమస్తే తెలంగాణ దినపత్రిక వార్షికోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ జోన్ నమస్తే తెలంగాణ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను నమస్తే తెలంగాణ సర్క్యులేషన్ జీఎం రాంరెడ్డి, ఎల్బీనగర్ జోన్ ఇన్చార్జి మేకల సత్యనారాయణ, సర్క్యులేషన్ ఇన్చార్జి నవీన్రెడ్డి కట్ చేశారు. అనంతరం సర్క్యులేషన్ జీఎం రాంరెడ్డి మాట్లాడుతూ…
తెలంగాణ మానస పుత్రికగా ప్రారంభమైన నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రజల ఆదరణను చూరగొని విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా కొనసాగుతున్న నమస్తే తెలంగాణ ప్రజల ఇంటి పత్రిక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నమస్తే తెలంగాణ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్కుమార్, నగేశ్, విజయ్కుమార్, నమస్తే తెలంగాణ ఎస్ఆర్లు రవీంద్రచారి, మధుసూదన్రెడ్డి, శ్రీనివాసులు, మంద రవి, వినోద్కుమార్, రిపోర్టర్లు రామకృష్ణ , యాదయ్య పాల్గొన్నారు.