సైదాబాద్, ఫిబ్రవరి 26 : ఇటీవల అకాల మరణం పొందిన ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక ఫొటో గ్రాఫర్ నర్నె రాజేశ్ కుటంబ సభ్యులకు సోమవారం టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ మజీదుల్లాహ్ హుస్సేన్ (ముజీబ్) రూ.21వేల చెక్కును రాజేశ్ సతీమణి నర్నె లావణ్యకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ రాజేశ్ కుమార్తె, కుమారుడి చదువులకు సంబంధించిన బాధ్యతలను తాను స్వీకరిస్తున్నానని, వారి చదువుల నిమిత్తం అయ్యే ఖర్చులను భరిస్తానని తెలిపారు. అదేవిధంగా కుటుంబ పోషణ నిమిత్తం నర్రె లావణ్యకు ఉద్యోగం కల్పించేందుకు తనవంతు సహాయ సహకారాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ యూనియన్ కేంద్ర నాయకులు పర్వతాలు, జిల్లా సభ్యులు కేఆర్.రాజ్కుమార్, కుర్రాడి శ్రీనివాస్, వైదిక్ శాస్త్రి, బొలిగిద్ద శంకర్, ముస్తఫా షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.