బంజారాహిల్స్,సెప్టెంబర్ 28: ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బొనాంజా ఉత్సవాల్లో పాల్గొంటున్న వినియోగదారులకు బహుమతుల పంట పండుతోంది. పండగ వేళలో ప్రతిరోజూ కానుకలు దక్కించుకునేందుకు ఉత్సాహంగా షాపింగ్ చేస్తున్నారు. దసరా బొనాంజాలో భాగంగా ఏడోరోజు బుధవారం షేక్పేటలోని కున్ హ్యుందయ్ షోరూమ్లో లక్కీ డ్రా తీశారు.
‘నమస్తే తెలంగాణ’ అడ్వర్టయిజింగ్ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రవీణ్కుమార్, జీఎం సురేందర్ రావు, ఏజీఎం రాజిరెడ్డి, ‘తెలంగాణ టుడే’ పత్రిక మార్కెటింగ్ హెడ్ చరణ్లతో పాటు కున్ హ్యుందయ్ వైస్ ప్రెసిడెంట్ పూర్ణిమ, సీఈవో రాజగోపాలన్ అశోక్, డీజీఎం కార్తిక్ కలిసి పలువురు వినియోగదారుల సమక్షంలో లక్కీ డ్రా తీసి ఐదుగురు విజేతలను ఎంపిక చేశారు. మొదటి బహుమతి ఎల్ఈడీ టీవీని కేపీహెచ్బీకి చెందిన వ్యాపారి వంగూరు అశోక్, రెండో బహుమతిని వైబ్రంట్ నిస్సాన్లో షాపింగ్ చేసిన కేదార్నాథ్, మూడో బహుమతిని కున్ హ్యుందయ్లో కొనుగోలు చేసిన నిధి, నాలుగో బహుమతిని చర్మాస్లో షాపింగ్ చేసిన డి.శ్రీశైలం, ఐదో బహుమతిని కేఎల్ఎంలో షాపింగ్ చేసిన షలోమీ గెల్చుకున్నారు.
సద్వినియోగం చేసుకోండి..
దసరా పండుగ సందర్భంగా వినియోగదారులకు ఆనందాన్ని పంచిపెట్టేందుకు ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ పత్రికల ద్వారా దసరా బొనాంజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎంపిక చేసిన ప్రత్యేక ఔట్లెట్స్లో షాపింగ్ చేసిన వినియోగదారులకు కూపన్లు అందించి రోజువారీగా లక్కీ డ్రా తీస్తున్నాం. ఈ బొనాంజా వేడుకలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 30 వరకు నిర్వహించనున్న బోనాంజాలో భాగంగా ఎక్కడికక్కడ షాపింగ్ చేస్తే బహుమతులు గెలుచుకోవచ్చో ప్రతి రోజూ ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టు డే’లో ప్రచురితమవుతున్నాయి. మరో మూడు రోజుల పాటు ఈ లక్కీ డ్రా తీస్తాం. చివరిరోజున బంపర్ డ్రాలో నిస్సాన్ మాగ్నెట్ కారును గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సుమారు 50వేలమంది దాకా వినియోగదారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
– ప్రవీణ్కుమార్, నమస్తే తెలంగాణ
అడ్వర్టయిజింగ్ డిప్యూటీ జనరల్ మేనేజర్
మూడేండ్లుగా అనుబంధం
‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బొనాంజాతో కున్ హ్యుందయ్కు మూడేండ్లుగా అనుబంధం ఉంది. పండుగ సమయంలో కస్టమర్లకు బహుమతులు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ దసరా బొనాంజాలో మా సంస్థ భాగస్వామ్యం కొనసాగుతుంది. ఈ రోజు మా షోరూమ్లో తీసిన లక్కీడ్రాలో బహుమతులు గెలుచుకున్న వారికి శుభాకాంక్షలు.
– బి. పూర్ణిమ, వైస్ ప్రెసిడెంట్, కున్ హ్యుందయ్
కస్టమర్లకు మంచి అవకాశం..
‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ దసరా బొనాంజాలో పాల్గొన్న వారికి బహుమతులు ఇచ్చే అవకాశం రావడం సంతోషకరం. మా షోరూమ్స్లో షాపింగ్ చేసిన వారికి బహుమతి రావడం మరింత ఆనందంగా ఉంది. రానున్న మూడురోజుల్లో మరింత మంది ఈ బొనాంజా వేడుకల్లో పాల్గొని అదృష్టాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాం. కస్టమర్లకు ఈ బొనాంజా మంచి అవకాశంగా నిలుస్తుంది.
– రాఘవేందర్రెడ్డి. మేనేజర్, కున్
హ్యుందయ్, షేక్పేట బ్రాంచ్
ఆనందం ముందే వచ్చింది..
నా సతీమణితో కలిసి ఇటీవల లక్డీకాపూల్లోని కున్ హ్యుందయ్లో క్రెటా కారు కొనుగోలు చేశా. అక్కడ ‘నమస్తే తెలంగాణ -తెలంగాణ టుడే’ దసరా బొనాంజా కూపన్లు ఇచ్చారు. ఫోన్ చేసి మాకు లక్కీడ్రాలో మొదటి బహుమతి వచ్చిందని చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. దసరా పండుగ సంతోషం ముందుగానే మా ఇంటికి వచ్చింది. కారు కొన్న ఆనందంతో పాటు దసరా బొనాంజాలో బహుమతి రావడం మరింత సంతోషాన్ని కలిగించింది. కూపన్లు రాసినప్పుడు బహుమతి వస్తుందని ఊహించలేదు.
– వంగూరు అశోక్, కేపీహెచ్బీ, వ్యాపారి
(లక్కీడ్రాలో మొదటి బహుమతి విజేత)