బంజారాహిల్స్, అక్టోబర్ 3 : పండుగ ముందరే.. వినియోగదారులకు పసందైన దసరా బొనాంజా వేడుకలను తీసుకొచ్చింది. దసరా సందర్భంగా “నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే” ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బోనాం జా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రెండో రోజు లక్కీ డ్రా తీశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు:12లోని నిలోఫర్ కేఫ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వినియోగదారుల సమక్షంలో నిలోఫర్ కేఫ్ అధినేత ఏ.బాబురావు, నమస్తే తెలంగాణ అడ్వర్టయిజింగ్ జీఎం సురేందర్ రావు చేతుల మీదుగా లక్కీ డ్రా తీశారు.
డ్రాలో అన్నోజిగూడకు చెందిన కుసుమ శ్రీకి 32 ఇంచుల ఎల్ఈడీ కలర్ టీవీ బహుమతిగా లభించింది. దిల్సుఖ్నగర్లోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో శనివారం కొనుగోలు చేసిన వస్ర్తాలతో పాటు లభించిన కూపన్కు బహుమతి వచ్చింది. రెండో బహుమతి రెడ్మీ నోట్ ప్రో బీ కావ్యకు లభించింది. మూడో బహుమతి రూ. ఐదువేల నగదు కేఎల్ఎం షాపింగ్ మాల్లో కొనుగోలు చేసిన జె.రమేష్కు దక్కింది. దీంతో పాటు నిలోఫర్ కేఫ్ తరఫున రెండు గిఫ్ట్ హ్యాంపర్లను లక్కీ డ్రాలో వై.అంజమ్మ, బి.సహదేవ్ గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ అడ్వర్టయిజింగ్ విభాగం ఏజీఎంలు రాజిరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు
పండుగల సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేకంగా డిస్కౌంట్లు ఇవ్వడం సర్వసాధారణమే. అయినా వారికి మరింత ఆనందాన్ని పంచిపెట్టేందుకు దసరా బొనాంజా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ‘నమస్తే తెలంగాణ’ జీఎం సురేందర్రావు పేర్కొన్నారు. ప్రతిఏటా నగరంలో ఎంపిక చేసిన ఔట్లెట్లలో కొనుగోలుదారులకు ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో దసరా బొనాంజా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 10 దాకా బొనాంజా కొనసాగుతుందని ఫ్రీడమ్ హెల్త్ కుకింగ్ అయిల్, కేఎల్ఎమ్ షాపింగ్ మాల్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారని సెలెక్ట్ మొబైల్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ ప్రధాన సహకారాన్ని అందిస్తుండగా, నిలోఫర్ కేఫ్ పవర్డ్ బై స్పాన్సర్గా వ్యవహరిస్తుందన్నారు. లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందిస్తున్నట్టు చెప్పారు. అక్టోబర్ 11న బంపర్ డ్రా బహుమతిని ప్రకటిస్తామన్నారు. నగరంలోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ దసరా బొనాంజా ఉత్సవాల్లో తాము కూడా భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని నిలోఫర్ కేఫ్ అధినేత ఏ.బాబురావు తెలిపారు. దసరా సందర్భంగా వినియోగదారులకు ఆనందాన్ని అందించేందుకు నమస్తే తెలంగాణ ఈ లక్కీ డ్రాను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 45 ఏళ్లుగా నిలోఫర్ కేఫ్ నగర వాసులకు విభిన్న రుచులతో ఛాయ్ అందిస్తున్నట్టు చెప్పారు.
షాపింగ్ చేసే సమయంలో కూపన్లు ఇచ్చారు. బహుమతి వస్తుందని ఊహించలేదు. కాని, కూపన్లు మాత్రం పూర్తిచేసి నిర్వాహకులకు అందజేశాం. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా ఎల్ఈడీ టీవీ వచ్చిందని ‘నమస్తే తెలంగాణ’ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పడంతో ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఆ తరువాత సంతోషం వేసింది. ఐటీ ఉద్యోగినిగా ఎన్నోసార్లు కూపన్లు నింపాను. కాని, ఎప్పుడూ బహుమతి రాలేదు. మొదటి సారిగా నమస్తే తెలంగాణ ద్వారా బహుమతి రావడం చాలా సంతోషంగా ఉంది. – కుసుమ శ్రీ, మొదటి బహుమతి విజేత
రోజంతా పని చేసి అలిపోయినప్పుడు కొత్త ఉత్సాహం రావాలంటే ఓ చాయ్ తాగాల్సిందే. రుచికరమైన చాయ్ను అందించడంలో నిలోఫర్ ప్రత్యేకత చాటుకుంటోంది. ప్రతి రోజు ఇక్కడ చాయ్ తాగాకే మిగతా పనులు చూసుకుంటాను. ఈ చాయ్తో అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉంది. – నారాయణ రావు, వినియోగదారుడు
పదిహేనేళ్లుగా నిలోఫర్ చాయ్ మా జీవితాల్లో భాగంగా మారింది. పాతబస్తీలో ఉన్నప్పటి నుంచి నిలోఫర్ చాయ్ రోజూ తాగుతుంటాం. బంజారాహిల్స్కు రావడంతో మరింత దగ్గరయింది. ఇక్కడ దొరికే చాయ్ రుచి మరెక్కడా దొరకదు. స్నేహితులందరం కలిసి రెగ్యులర్గా వస్తుంటాం. చాయ్ రుచిలో తేడా వచ్చిందంటే వెంటనే యజమాని బాబూరావుకు చెబితే సరిచేయించి ఇస్తారు. – విక్కీ సింగ్, వినియోగదారుడు