Fake Notes | మైలార్దేవ్పల్లి, ఏప్రిల్ 12: రూ. 500 నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్వోటీ, మైలార్దేవ్పల్లి పోలీసులు పట్టుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి.. మార్కెట్లోకి అక్రమంగా నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న ఇద్దరు నిందతుల వద్ద నుంచి రూ. 6.62 లక్షల విలువ చేసే ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టర్మధు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణానికి చెందిన గంగరాజు, అభినందన్లు.. మహారాష్ర్టకు చెందిన సచిన్ పవార్, సురేశ్ పవార్ ఫేస్బుక్లో పోస్టు చేసిన నకిలీ కరెన్సీ వీడియోను చూసి వారిని సంప్రదించారు.
వారి వద్ద నమూనాగా 10 నకిలీ నోట్లను కోనుగోలు చేశారు. సికింద్రాబాద్లో ఫేస్బుక్ ద్వారా పరిచయమైన లక్షి అనే వ్యక్తికి ఐదు నోట్లను ఇచ్చి మార్కెట్లో మార్పిడి చేయించారు. సులభంగానే మారుతున్నాయని గ్రహించి.. గంగరాజు 3.5 లక్షలు పోగు చేసుకొని బెంగళూరు, సూరత్, నందుర్బార్ మీదుగా మహారాష్ట్రలోని చద్వేల్కు చేరుకున్నారు. అక్కడ సచిన్ పవార్, సురేశ్ పవార్లను కలిసి 17 లక్షల నకిలీ నోట్లను తీసుకొని 3.5 లక్షలు (1:5 నిష్పత్తి) చెల్లించారు.
సికింద్రాబాద్లోని లాడ్జీలో బస చేశారు. మల్కాజిగిరిలోని సాయిరాం థియేటర్ సమీపంలో నరేశ్ అనే వ్యక్తి సాయంతో బైక్ను అద్దెకు తీసుకొని నకిలీ నోట్లను విక్రయించేందుకు మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మెహిఫిల్ రెసార్టెంట్కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గంగరాజు, అభినందన్ను రెడ్హ్యాండేడ్గా పట్టుకున్నారు. నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.