ఎల్బీనగర్, మే 8 : మూసీకి సుందరహంగులు అద్దుకున్నాయి.. మూసీ నదిలో నీరు సాఫీగా పారేలా చేయడంతో పాటు దానికి ఇరువైపులా వాకింగ్ ట్రాక్, పశ్చిక బయళ్లు, గార్డెనింగ్, అందమైన పూలమొక్కలతో ఆహ్లాదకరంగా, అందంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు మూసీ తీరానికి రావాలంటే ముక్కు మూసుకుని రావాల్సి వచ్చేది. అయితే.. నేడు మూసీతీర ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మూసీ తీరానికి సుందరహంగులు సమకూరా యి. నాగోలు బ్రిడ్జి మొదలుకుని సత్యానగర్ వరకు మూసీకి ఇరువైపులా వాకింగ్ ట్రాక్ ను సిద్ధం చేయడంతో పాటు అందమైన మొ క్కలు, గార్డెనింగ్ను ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ముచికుందా నదిగా పేరుగాంచిన మూసీ నదిని.. తిరిగి సుందరమైన, అందమైన నదిగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలీకృతమవుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా మూసీని సుం దరంగా తీర్చిదిద్దడం లో ఎల్బీనగర్ ఎమ్మె ల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి చర్య లు చేపట్టారు. దీంతో నేడు మూసీ అన్ని హంగులతో రూపుదిద్దుకుని.. ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తోం ది. వాకింగ్ కోసంతోపాటుగా ఆహ్లాదం కోసం మూసీ తీరానికి వస్తున్నారు. ఒక్కప్పుడు కంపు ఉన్న ప్రాంతంలోనే నేడు గులాబీలు, ఇతర పూల వాసనలతో గుభాలిస్తున్నది.