కవాడిగూడ, డిసెంబర్ 30 : విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో పాటు ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. ఈ మేరకు శుక్రవారం కవాడిగూడ డివిజన్ కోదండరెడ్డినగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హ్యూజ్ టౌన్లో ఏర్పాటు చేసిన ‘టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్’ (టీఎల్ఎం) మేళాను ఎమ్మెల్యే ముఠా గోపాల్, హైదరాబాద్ జిల్లా డీఈఓ రోహిణితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు పలు అంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకుంటేనే విద్యలో రాణించగలుగుతారని అన్నారు. హైదరాబాద్ జిల్లా డీఈఓ రోహిణి మాట్లాడుతూ.. ముషీరాబాద్ రేంజ్-1 స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో ఏడు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్తో మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యస్థను మరింత బలోపేతం చేయడానికి, విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో పూర్తి అవగాహన పెంపొందిస్తున్నామని అన్నారు.
దీంతో పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ చిరంజీవి, డిప్యూటీ ఐఓఎస్ స్వరూపారాణి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం నరేందర్ యాదవ్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, బీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, కవాడిగూడ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు వల్లాల శ్యామ్యాదవ్, ఎన్డీ సాయికృష్ణ, వి.శ్రీనివాస్ యాదవ్, శ్రీహరి, మాదవి, మాణిక్యం మధు, ప్రకాశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
క్రీడలతోనే మానసిక ఉల్లాసమని, యువత, విద్యార్థులు క్రీడల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి మంచి గుర్తింపు తేవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం భోలక్పూర్ డివిజన్లోని ఘంటసాల మైదానంలో నెహ్రూ యువకేంద్ర హైదరాబాద్, ఐషు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని అన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తున్న ఐషు ఫౌండేషన్ను ఆయన అభినందించారు.
ఈ క్రీడల్లో 15 వాలీబాల్, 15 కబడ్డీ జట్లు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన పురస్కార గ్రహీత పానుగంటి మహేశ్ కుమార్, ఐషు ఫౌండేషన్ అధ్యక్షురాలు రోజా రమణి, నెహ్రూ యువకేంద్ర హైదరాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్, కుష్బుగుప్త, బీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకులు ముఠా జయసింహ, నాయకులు వై. శ్రీనివాస్ రావు, ఆర్. శ్రీనివాస్, బింగి నవీన్కుమార్, శంకర్ గౌడ్, ముచ్చకుర్తి ప్రభాకర్, బాక్సర్ కృష్ణ, కృష్ణ, శ్రీకాంత్, ఉప్పలయ్య, ఐషు ఫౌండేషన్ సభ్యులు కె.కిశోర్కుమార్, ప్రవీణ, రోహన్, సాయి తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి, డిసెంబర్ 30 : రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. అందులో భాగంగా కోట్లాది రూపాయలతో కొత్త రోడ్ల నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. శుక్రవారం గాంధీనగర్ డివిజన్ సబర్మతి నగర్ బస్తీలో నూతన వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, వాటర్ వర్క్స్ మేనేజర్ కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్కుమార్, ముచ్చకుర్తి ప్రభాకర్, నర్సింగ్ ముదిరాజ్, శ్రీకాంత్, పి.రాజ్కుమార్, ఎండీ గౌస్, హన్మంతు, శివకుమారి, ఎంబీ కృష్ణ, యాసిన్ అలీ, రత్నయ్య, సత్య చందు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.