ముషీరాబాద్, మే 18 : ముషీరాబాద్ డివిజన్ చేపల మార్కెట్-పార్శిగుట్ట రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంకిగా మారిన డ్రైనేజీ పైపులైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ జలమండలి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి పార్శిగుట్ట-చేపల మార్కెట్ రోడ్డు పనులను పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న గుత్తేదారు ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు చేపట్టడం వల్లనే పైపులైన్లు పగిలిపోయి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి అవరోధంగా మారాయని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే వాహనాలకు ఇబ్బందులు లేకుండా పైపులైన్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఈఈ సన్నీ, జలమండలి జీఎం మహేశ్, టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, మల్లేశ్ యాదవ్, జీ.గోవింద్, అశోక్, నర్సింగ్ప్రసాద్, అస్లాం, ఎయిర్టెల్ రాజు, డి.శివముదిరాజ్, లక్ష్మణ్ గౌడ్, బాల్రాజ్గౌడ్, సాంబశివరావు, ఆకుల అరుణ్, సదా, శ్రీకాంత్ పాల్గొన్నారు.