మాదాపూర్, జూలై 30: మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్లో గురువారం వెలుగుచూసిన ప్రేమి కుల మరణం మిస్టరీ వీడింది. పెండ్లి విషయమై ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఆ యువతిని ప్రేమికుడు గొంతుకోసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. బొంరాస్పేట్ మండలానికి చెందిన సంతోషి (25), వికారాబాద్ జిల్లాకు చెందిన రాములు (25) ప్రేమించుకున్నారు. వీరి వివాహాన్ని పెద్దలు అంగీకరిం చలేదు. బుధవారం వీరిద్దరూ మాదాపూర్లోని లెమన్ ట్రీ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. సంతోషి పదే పదే పెండ్లి విషయాన్ని ప్రస్తావించింది. దీంతో వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. రాములు బ్లేడ్తో ఆమె గొంతు కోశాడు. రక్తం తీవ్రంగా రావడంతో కడుకునేందుకు ఆమె బాత్రూమ్లోకి వెళ్లి అక్కడే కుప్పకూలి పోయింది. ఆమె చనిపోయిన త ర్వాత తాను బతకడం ఎందుకని రాములు కూడా బ్లేడ్తో గొంతుకోసుకున్నాడు. ఆ తర్వాత ఆమె చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. వారిద్దరికీ ఇది వరకే పెండ్లి అయినట్లు గ్రామస్తులంటున్నారు.