బోడుప్పల్, అక్టోబర్ 3 : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన రూ.30లక్షల నిధులు గోల్మాల్ అయినట్లు మున్సిపల్ కమిషనర్ జి.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. వివిధ పన్నుల రూపంలో నగర ప్రజల నుంచి సేకరించిన నిధులను ఏప్రిల్ నుంచి కార్పొరేషన్లో జమచేయకుండా అన్యాక్రాంతం చేసినట్లు కమిషనర్ గుర్తించారు. 7.7.2023న కమిషనర్గా పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్న జి.వేణుగోపాల్ రెడ్డి ఇన్చార్జి కమిషనర్ వాణిరెడ్డి పీరియడ్లో వసూలైన నిధులపై ఆరాతీయగా విషయం బయటపడింది.
బాధ్యుల నుంచి రూ.30లక్షల నిధులను రికవరీ చేసిన ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. నిధుల మళ్లింపులో చేతివాటం చూపిన లక్ష్మిపై ఉన్నతాధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా 11మంది మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను (బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు) విధుల నుంచి తొలగించి మేడిపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కమిషనర్ తెలిపారు. స్పెషల్ ఆడిట్ నిర్వహించాలి.