ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సీతాఫల్మండిలోని కల్యాణ వేంకటేశ్వరుని ఆలయం వద్ద ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరిన భక్తులు, (ఇన్సెట్లో) జియాగూడ వేంకటేశ్వర ఆలయంలో స్వామివారి ఊరేగింపు నగరం గోవింద నామస్మరణతో మార్మోగింది. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.
వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వైష్ణవ ఆలయాల్లో విశేష పూజాదికాలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేకువ జాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ దేవాలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.