హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్
లో భాగంగా మిసెస్ ఇండియా సుహాసిని జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.
మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణం అందించాలంటే మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.