సిటీబ్యూరో, మే 23, (నమస్తే తెలంగాణ) : మూసీ నది అభివృద్ధి సంస్థ (ఎంఆర్డీసీఎల్) సూపరింటెండెంట్ ఇంజినీరు ఎస్.వెంకటరమణ గురువారం మృతి చెందారు. అస్వస్థతకు గురైన ఆయన దాదాపు 24 రోజులుగా సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో ఉండగా.. చెమటలు పట్టడంతో ఆయనను యశోద ఆసుపత్రికి తరలించారు. ఆ రోజు నుంచి కోమాలోనే ఉన్న వెంకటరమణ గురువారం మృతిచెందినట్లు యశోద వైద్యులు ప్రకటించారు. శుక్రవారం నగరంలోని లాలాపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుపనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వివిధ హోదాల్లో పనిచేసిన వెంకటరమణ పదవులకు వన్నె తీసుకువచ్చారని ఇంజినీర్లు గుర్తు చేసుకున్నారు.