శామీర్పేట, మార్చి 27: విద్యార్థులు, చిన్నారులు పోషకాహారంపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ ఎల్లూభాయిబాబు, సర్పంచ్ బాలమణి సూచించారు. పోషణ్ పక్వాడ్ అభియాన్లో భాగంగా శామీర్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిరు ధాన్యాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోషకాహార లోపాన్ని అరిట్టడానికి చిరు ధాన్యాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బాలమణి, శామీర్పేట జడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపాల్ నిర్మళాదేవి, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు నిర్మళ, శకుంతల, రమాదేవి, పావని, భవానీ, విద్యార్థులు పాల్గొన్నారు.
కీసర, మార్చి 27: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే అంగన్వాడీలకు మహర్దశ పట్టిందని కరీంగూడ సర్పంచ్ కౌకుట్ల గోపాల్రెడ్డి అన్నారు. కీసర మండల పరిధి కరీంగూడ గ్రామంలో సోమవారం అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ్ అభియాన్లో భాగంగా కిశోర బాలికలకు, గర్భిణులు, బాలింతలకు చిరుధాన్యాల వల్ల కలిగే లాభాల గురించి, రక్త హీనత గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాధవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి దివ్య, సీసీ సుదర్శన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ యశోద, అంగన్వాడీ టీచర్ అరుణ, ఆశవర్కర్ రాధ, వీఓ సంధ్య పాల్గొన్నారు.
మేడ్చల్, మార్చి 27: సమతుల ఆహారంతో బాలికలు ఆరోగ్యంగా ఎదుగుతారని, చిరుధాన్యాలకు ఆరోగ్యానికి ఉపకరిస్తాయని మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామ సర్పంచ్ సురేందర్ ముదిరాజ్ అన్నారు. సోమవారం పోషణ్ పక్వాడ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిరు ధాన్యాలపై అవగాహన కల్పించారు.అనంతరం పిల్లలు, తల్లులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.