మన్సూరాబాద్, అక్టోబర్ 6: ఎల్బీనగర్, మన్సూరాబాద్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం తెలంగాణ ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం, ఫోటో టెక్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ట్రేడ్ ఎక్స్పో కార్యక్రమానికి రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఫొటో ట్రేడ్ ఎక్స్పోను పురస్కరించుకుని స్టాళ్లలో ఏర్పాటు చేసిన వివిధ రకాల కెమెరాలు, వీడియో కెమెరాలు, అల్బమ్స్తో పాటు ఇతర పరికరాలను ఆయన నిషితంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఫొటో ట్రేడ్ ఎక్స్పోలో ప్రదర్శిస్తున్న అత్యాధునిక ఫొటో కెమెరాలు, వీడియో కెమెరాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. అనంతరం కేబీఆర్ కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ పల్లె రవికుమార్, రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యుడు కె. కిషోర్గౌడ్, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, తెలంగాణ ఫోటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్కే హుస్సేన్, వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకిరెడ్డి వెంకట్రెడ్డి, ఫోటోటెక్ అధినేత జి. అభిమన్యురెడ్డి, సౌత్ ఇండియా అధ్యక్షుడు పరమేష్ తదితరులు పాల్గొన్నారు.