నేరేడ్మెట్,అక్టోబర్ 9: నాణ్యమైన సరుకులు, తక్కువ ధరల్లో గృహోపకరణాలు దొరికే ఏకైక మార్కెట్ ఉషోదయ సూపర్ మార్కెట్ అని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. శనివారం వాయుపురిలోని అత్యాధునిక హంగులతో 18వ ఉషోదయ సూపర్ మార్కెట్ను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ సంతోష్ కుమార్ సూపర్ మార్కెట్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో నిత్యావసరాలను అందిస్తున్న సూపర్మార్కెట్ నిర్వాహకుడు మన్నార యుగేందర్ను ఆయన అభినందించారు. వినియోగదారుల నమ్మకమే ఉషోదయ సూపర్ మార్కెట్ విజయ రహస్యమని నిర్వాహకుడు యుగేందర్ అన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ సభ్యులు రాఘవ, నేరేడ్మెట్ కార్పొరేటర్ మీనా ఉపేందర్రెడ్డి, కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి, బండారు లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, కొత్తరామారావు, కాసం మహిపాల్ రెడ్డి, టీజే రెడ్డి, రావుల అంజయ్య, డివిజన్ అధ్యక్షుడు మహత్యవర్ధన్, జీవగన్, ఆలం మహేష్యాదవ్, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, చెన్నారెడ్డి, శివకుమార్, మహేష్, రాజు పాల్గొన్నారు.