మణికొండ, అక్టోబర్ 9 : రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. నియోజకర్గ పరిధిలోని కిస్మత్ఫూర్, బైరాగిగూడలోని అభ్యుదయ నగర్కాలనీ, నార్సింగిలోని బృందావన్కాలనీ, గండిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట రూ.24కోట్ల 63 లక్షల నిధులతో నిర్మించిన రిజర్వాయర్లను సోమవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం గండిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ చెంతనే జంట జలాశయాలున్నా గతంలో గుక్కెడు నీటి కోసం నియోజకవర్గవాసులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు అనేక పర్యాయాలు ఆందోళనలు చేసినా.. తాగునీటి సమస్యను ఎవరూ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించిందన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాజేంద్రనగర్ నియోజకవర్గానికి శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించారని, ఆయన గొప్ప నేత అని కొనియాడారు. కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్యాదవ్, కౌన్సిలర్లు శ్రీకాంత్రావు, పత్తి ప్రవీణ్యాదవ్, గోపాల సునీతాగణేశ్కుమార్, విజేత ప్రశాంత్యాదవ్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బండ్లగూడ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి ఎంపీ రంజిత్రెడ్డి తాగునీటి రిజర్వాయర్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి, కమిషనర్ శరత్ చంద్ర, పీఏసీఎస్ చైర్మన్ రాందాస్ ముదిరాజ్, కార్పొరేటర్లు నిఖిల సంగారెడ్డి, శ్రీలత సురేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్: నీటి కష్టాలకు శాశ్వతంగా చరమగీతం పాడామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం కొంపల్లి మున్సిపాలిటీ అపర్ణ ఫాంగ్రోస్లో రూ.10.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 20 లక్షల నీటి సామర్థ్యం గల రిజర్వాయర్ను స్థానిక కొంపల్లి చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, జలమండలి అధికారులతో కలిసి ప్రారంభించారు. కొంపల్లిలో కొత్తగా రూ.10.5 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్ ద్వారా 45 కిలోమీటర్ల మేరా గోదావరి పైపులైన్లు, నీటి సరఫరాకు అంతర్గత పైపులైన్లు వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూబ్ల్యూ ఎస్బీ జనరల్ మేనేజర్ అశోక్కుమార్, డీజీఎం డీవీ త్రినాథ్రావు తదితరులు పాల్గొన్నారు.