కొండాపూర్, అక్టోబర్ 4: భారతదేశం భిన్న చారిత్రాత్మక కట్టడాలకు నిలయమై అర్కిటెక్చర్ హబ్గా ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం పొం దిందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్లోని శ్రీ వెంకటేశ్వర అర్కిటెక్చర్ కళాశాల సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న వేడుకలను ‘ప్రపంచ అర్కిటెక్చర్’ దినోత్సవాన నిర్వహించింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఎం పీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో సోమవారం కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే భిన్న కట్టడాలకు నిలయంగా భారతదేశం ఉందని, ప్రాచీన కా లం నుంచే నిపుణులైన అర్కిటెక్చర్లు మన దేశం లో ఉన్నారన్నారు. అనంతరం కళాశాలలోని వివిధ విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ని, బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ సురభి అజిత, ప్రిన్సిపాల్ కామినిసింగ్, బోధన సిబ్బం ది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.