మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 28: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో లింక్ రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూ రు చేయడంతో వాహనదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగారం మున్సిపల్ పరిధిలోని ప్రధాన లింక్ రోడ్ల అభివృద్ధికి రూ.209 కోట్ల నిధులు విడుదల చేసింది. మున్సిపాలిటీలోని ఐదు లింక్ రోడ్లను హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ త్వరలో రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టనుంది. రాంపల్లి చౌర స్తా నుంచి సర్వే నంబర్ 421 హెచ్పీ పెట్రోల్ పంపు వరకు 3.90 కిలో మీటర్ల మేరకు రూ. 46 కోట్లు, సర్వే నంబర్ 421 నుంచి యంనంపేట్ వరకు 3.10 కిలో మీటర్ల మేరకు రూ 38.కోట్లు, రాంపల్లి జంక్షన్-ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వయో కరీంగూడ 3.80 కిలో మీటర్ల మేరకు రూ.50 కోట్లు, యంనంపేట్ ైప్లె ఓవర్ నుంచి రాంపల్లి డబుల్ బెడ్రూం ఇండ్ల వరకు 2.60 కిలీ మీటర్ల మేరకు రూ. 30 కోట్లు, చర్లపల్లి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి రాంపల్లి జంక్షన్ వరకు 3.30 కిలో మీటరల మేరకు రూ. 45 కోట్ల నిధులు ప్రభుత్వ మంజూరు చేసిం ది. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు. లింక్ రోడ్ల విస్తరణకు భారీగా నిధులు మంజూరు చేయడంపై ప్రజాప్రతినిధులు, నాయకులు, వాహనదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లింక్ రోడ్ల అభివృద్ధితో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తీరడంతో పాటు ప్రయాణ సౌలభ్యం మెరుగు పడనుంది. ఏండ్లనాటి లింక్ రోడ్ల సమస్యలు త్వరలో తీరనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం లింక్ రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించడంతో వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. నాగారం మున్సిపాలిటీలో లింక్ రోడ్ల విస్తరణతో ఉమ్మడి నల్గొండ, వరంగల్, మెదక్ జిల్లాల నుంచి నగరానికి నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న లింక్ రోడ్ల నుంచి రాకపోకలు సాగిస్తారు.వరంగల్ జాతీయ రహదారి నుం చి నాగారం మీదుగా వాహనదారులు నగరానికి వెళుతుంటారు. నిత్యం నగర శివారుల్లోని కాలేజీలకు, నగరానికి పనుల నిమిత్తం ఈ రోడ్ల మార్గంలో ప్రయాణాలు సాగిస్తారు. నాగారం మున్సిపాలిటీలో ఉన్న లింక్ రోడ్ల అభివృద్ధితో పూర్తిగా వాహనదారులకు ఊరట లభించనుంది.
రాంపల్లి నుంచి చర్లపల్లికి వెళ్లి దారిలో ఉన్న వాగు వర్షాలకు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ రోడ్ల విస్తరణతో వాగు ఎత్తు పెంచడంతో వాహన రాకపోకలు సాఫీగా సాగుతాయి. రోడ్ల విస్తరణ పనులు త్వరలో చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
నాగారం మున్సిపల్ పరిధిలో ఉన్న లింక్ రోడ్ల విస్తరణతో వాహనదారుల ఇబ్బందు లు తొలుగుతాయి. మున్సిపల్ పరిధి నుంచి నగరానికి వెళ్లే లింక్ రోడ్ల సమస్య ఏండ్ల నుం చి ఉంది. తెలంగాణ ప్రభు త్వం లింక్ రోడ్ల అభివృద్ధికి రూ.209 కోట్లు కేటాయించింది. రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలకు కృతజ్ఞతలు.
-కౌకుంట్ల చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ నాగారం.
నాగారం మున్సిపల్ పరిధిలో ఉన్న లింక్ రోడ్ల అభివృద్ధికి రూ. 209 కోట్ల ప్రభుత్వం మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే రోడ్ల అభివృద్ధి పనులు మొదలు అవుతాయి.- ఎ.వాణిరెడ్డి, కమిషనర్, నాగారం మున్సిపాలిటీ