జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ,ఆగస్టు1: చంటి పిల్లలకు తల్లిపాలకంటే శేష్టమైనది.. బలమైనది మరొకటి లేదని బోరబండ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీవల్లి పేర్కొన్నారు. తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం బోరబండ యూపీహెచ్సీలో గర్భిణులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు శ్రీరాంనగర్ క్లస్టర్లోని అన్ని పీహెచ్సీలలో తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనురాధ తెలిపారు.
పద్మారావునగర్లో..
బన్సీలాల్పేట్, ఆగస్ట్ 1 : తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యమని, బిడ్డ పుట్టిన తరువాత ఆరు మాసాల వరకు తల్లి పాలు పట్టించాలని, అది బిడ్డకు, తల్లికి ఎంతో మేలు చేస్తుందని అంగన్వాడీ టీచర్ కుల్సుమ్ అన్నారు. సోమవారం తల్లిపాల వారోత్సవాల ప్రారంభం సందర్భంగా పద్మారావునగర్లోని హమాలీబస్తీ అంగన్వాడీ కేంద్రంలో తల్లులకు, గర్భిణులకు అవగాహన శిబిరం నిర్వహించారు.