కొండాపూర్ : భర్తతో గొడవ పడి భార్య తన కూతురిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చందానగర్లోని రెడ్డి కాలనీలో నివాసం ఉండే కుమ్మం సాయికుమార్ సోదరి సదెపల్లి స్వాతి (27) భర్తతో గొడవపడి ఫిబ్రవరి 11న సోదరుడి ఇంటికి తన కూతురితో కలిసి వచ్చింది.
కాగా ఫిబ్రవరి 19న సాయి కుమార్ విధులకు వెళ్ళగా, స్వాతి తన వదినకు బయటకు వెళ్తున్ట్లు చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళింది. ఎంతకీ తిరిగిరాకపోవడంతో తెలిసిన వారిని, బంధువులను ఆరాతీసినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ మేరకు సాయి కుమార్ ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు.