ఉస్మానియా యూనివర్సిటీ/గౌతంనగర్/మల్కాజిగిరి/వినాయక్నగర్/నేరేడ్మెట్, జూలై 1: పట్టణ ప్రగతిని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి మూడో దశ కార్యక్రమాన్ని తార్నాక డివిజన్లోని సత్యనగర్లో టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ, పట్టణ అభివృద్ధి కమిటీల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇంటింటికీ నీటి సరఫరా అయ్యేవిధంగా చూడాలన్నారు. రోడ్డు పక్కన, ప్రభుత్వ భవనాలు, ఇతర ఖాళీ స్థలాల్లో తప్పకుండా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్రెడ్డి, సునీల్జ్, మధుకర్, ఎర్ర నాగరాజు, వంజరి వెంకటేశ్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
పరిశుభ్రత పచ్చదనమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కార్పొరేటర్ మేకల సునీత అన్నారు. గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్, డిప్యూటీ కమిషనర్ దశరథ ఆధ్వర్యంలో మల్లికార్జుననగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ గ్రౌండ్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకట్రెడ్డి, మల్లికార్జుననగర్ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
‘పట్టణ ప్రగతి’లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మల్కాజిగిరి కార్పొరేటర్ ఊరపల్లి శ్రావణ్కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన మల్కాజిగిరి గాంధీపార్కులో పట్టణ ప్రగతి కార్యక్రమంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. డివిజన్లో ఎక్కడ కూడా చెత్త కుప్పలు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా విరివిరిగా మొక్కలు నాటాలన్నారు.
మల్కాజిగిరి పోలీస్స్టేషన్ బయట ఇన్స్పెక్టర్ జగదీశ్వర్రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ లు పలువురు పాల్గొన్నారు.
హరితహారంలో భాగస్వాములుకావాలి కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి
హరితహారంలో అందరూ భాగాస్వాములు కావాలని కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అన్నారు. గురువారం వినాయక్నగర్ డివిజన్ దీన్దయాళ్నగర్ కాలనీలో పారిశుధ్య పనులను కార్పొరేటర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈలు సువర్ణ, మాధవి, డివిజన అధ్యక్షుడు ఓంప్రకాశ్, ప్రధాన కార్యదర్శి మణిరత్నం, ఉపేందర్, జగన్మోహన్రావు, నవీన్, ఆనంద్ పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం మొక్కలు నాటారు. ఆయనతో పాటు పలువురు ఎస్ఐలు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.