ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 1: సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి అని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి కొనియాడారు. ‘దళిత సాధికారత పథకం’ ప్రవేశపెట్టినందుకు గాను తార్నాక డివిజన్ లాలాపేటలోని జయశంకర్ స్టేడియం వద్ద గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డితో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ దళితుల అభివృద్ధికి మొదటి విడుతగా రూ.1200 కోట్లు విడుదల చేసి తన చిత్తశుద్ధిని చాటిచెప్పారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్రెడ్డి, సునీల్ ముదిరాజ్, వెంకటేశ్, మధుకర్, నాగరాజు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.