బాలానగర్, ఆగస్టు 17 : కూకట్పల్లిలో మోరీస్ గ్యారేజెస్ (ఎంజీ) మోటార్స్ కార్ షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. నగరంలో ఉన్న ఎంజీ కార్ షోరూమ్ల సరసన మూసాపేట గోద్రెజ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎంజీ మోటార్స్ కార్ షోరూం వచ్చి చేరింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా హాజరై ప్రారంభించారు.
అనంతరం షోరూమ్లో జ్యోతి ప్రజ్వలన చేసి నగరంలో 9వ షోరూమ్ నిర్వహణను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంజీ కార్లు సాంకేతిక సామర్థ్యంతో పని చేస్తాయని తెలిపారు. ఎంజీ కార్లలో పూర్తిగా సంకేతికత అందుబాటులో ఉండటంతో క్రేజ్ పెరుగుతుందన్నారు. దీంతో మార్కెట్లో ఎంజీ కార్లకు మరింత డిమాండ్ పెరిగడంతో బుకింగ్లు కూడా అదే స్థాయిలో పెరిగాయన్నారు. రాబోయే కాలంలో ఎంజీ కార్లు నంబర్. 1 స్థానంలోకి రావడం ఖాయమన్నారు.