వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 12: ప్రజారోగ్యంపై నిరంతర పరిశోధనలు జరగాలని ఐఐపీహెచ్హెచ్ డైరెక్టర్ ప్రొ. మధుబాల అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హైదరాబాద్ (ఐఐపీహెచ్హెచ్), సైరస్ పుణే వాళ్ల సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజస్ అండ్ ప్యాండమిక్ ప్రివెన్ష్తో జరిగిన ఒప్పందం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వచ్చే రోగాలు, అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి అంకితమైన మార్గదర్శక కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. వీపీఎఫ్ నుంచి ఐఎన్ఆర్ రూ. 25 కోట్ల విరాళం ద్వారా మద్దతు తెలిపిందన్నారు. సెర్వికల్ క్యాన్సర్కు వ్యాక్సినేషన్పై సహకరించాలన్నారు.
ఐఐపీహెచ్హెచ్కు యూనివర్సిటీ హోదా కల్పించేందుకు విద్యామంత్రిత్వ శాఖ ఈ నెల 11న ఇండెంట్ జారీ చేసిందని గుర్తు చేశారు. డా. సంజయ్ జోడ్పే మాట్లాడుతూ.. జాతీయ సహాయకుల సాంకేతికత సహాయాన్ని అందిస్తూ రూ. 30 కోట్ల గ్లోబల్ గ్రాంట్ను పొందామన్నారు. సైరస్ పుణేవాళ్ల సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజస్ అండ్ ప్యాండమిక్ ప్రివెన్ష్నుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డా. శ్రీనాథ్ రెడ్డి, డా. సుధాకర్ రెడ్డి, సచింద్ర నాథ్, మదుమోహన్, డా.రఘుపతి అంచెల తదితరులు పాల్గొన్నారు.