సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): మూసీ(Moosey) సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా హైడ్రాలిక్స్ మోడల్స్(Hydraulics Models) రూపకల్పన కోసం పిలిచిన టెండర్ గడువు ఏప్రిల్ 6 వరకు పొడిగించారు. నగరం మధ్యలోంచి పారుతున్న మూసీ నది మురికి నీటి కూపంగా మారింది. దీన్ని పూర్తి స్థాయిలో సుందరీకరణ చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్)ను ఏర్పాటు చేసింది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.
3 ఏళ్లలోనే దీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా గండిపేట, హిమాయత్సాగర్ల నుంచి ప్రారంభమయ్యే నదుల ప్రవాహ ప్రాంతాలను సమగ్రంగా అధ్యయనం చేసి అవసరమైన నివేదికలను రూపొందించేందుకు ‘సిమ్యులేషన్ మోడల్ ఫర్ హైడ్రాలిక్స్’పేరుతో టెండర్లను పిలిచింది. అనుభవం కలిగిన కన్సలెంట్ల ఎంపిక కోసం టెండర్లను ఏప్రిల్ 6 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.