కంటోన్మెంట్, ఆగస్టు 20 : కంటోన్మెంట్ వ్యాప్తంగా శుక్రవారం మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. బోర్డు పరిధిలోని బోయిన్పల్లి, రసూసల్పురా, మారేడ్పల్లి, తిరుమలగిరితో పాటు పలు ప్రాంతాల్లో ఆలంలను ఊరేగించి మొహర్రం వేడుకలను నిర్వహించుకున్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
రెండో వార్డు రసూల్పురాలోని గన్బజార్లో నిర్వహించిన వేడుకల్లో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి దట్టీలు సమర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుడు కుమార్ ముదిరాజ్, కాశీం, ఉస్మాన్, ఇలియాస్, ఇమ్రాన్, అమీర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.