మన్సూరాబాద్, మార్చి 23: తాగునీరు కలుషితంగా వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విజయశ్రీకాలనీ అధ్యక్షుడు మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్ ఆరోపించారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి విజయశ్రీకాలనీలోని కమ్యూనిటీ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కాలనీలోని రోడ్డు నెంబర్ 4, 5, 6లలో కలుషిత నీరు రావడం వలన 50 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు.
రోబో కెమెరాలను పెట్టి తనిఖీలు చేస్తున్నప్పటికి సమస్య ఎక్కడ ఏర్పడిందో జలమండలి అధికారులు కనుక్కోలేక పోతున్నారన్నారు. కలుషిత నీరు వలన ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. నీటి నుంచి దుర్వాసన వస్తుందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు భీమిడి నర్సింహారెడ్డి, కాలనీవాసులు జంగయ్య, జంగారెడ్డి, రాంచందర్, నల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Hyd4