చిక్కడపల్లి : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ప్రధాన మంత్రి మోదీ రాష్ట్రంపై పగ పెంచుకున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రధాని మంత్రి మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బీజేపీ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ పోరాటాన్ని ప్రధాని అవమానించారని ఆయన మండిపడ్డారు.
గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాఖేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ,పార్టీసీనియర్ నాయకుడు ముఠా నరేశ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా ,మారిశెట్టి నర్సింగ్ రావు, గడ్డమీది శ్రీనివాస్, ప్రభాకర్, రవి శంకర్ గుప్తా ,ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.