హైదరాబాద్, జనవరి 26(నమస్తే తెలంగాణ) : రాజ్యాంగంలోని పీఠికలో పొందపర్చిన ఉదేశాలను, లక్ష్యాలను ఒక్కొకటిగా విధ్వంసం చేసేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురసరించుకుని హైదరాబాద్ మగ్ధూంభవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని కూనంనేని సాంబశివరావు గురువారం ఆవిషరించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్.బోస్,
ఈ.టి నర్సింహ, సీనియర్ నాయకుడు కందిమళ్ల ప్రతాప్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, కె.శ్రీనివాస్ రెడ్డి,మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన, శ్రామిక మహిళా ఫోరం కన్వీనర్ పి.ప్రేంపావని, తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, ఎఐవైఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.అంజయ్య నాయక్, బీసీ హకుల సాధనసమితి ప్రధాన కార్యదర్శి పాండురంగా చారి పాల్గొన్నారు.