సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రుతుపవనాలకు తోడు అల్పపీడనం ఏర్పడడంతో గ్రేటర్లోని పలు చోట్ల శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాత్రి 11 గంటల వరకు నగరంలోని కూకట్పల్లిలో అత్యధికంగా 6.58 సెం.మీలు, జీడిమెట్లలో 6.08 సెం.మీలు, శంషిగూడలో 5.75 సెం.మీలు, షాపూర్నగర్లో 5.70 సెం.మీలు, గాజుల రామారంలో 5.63 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
అల్పపీడనం ప్రభావంతో రాగల మరో రెండు రోజులు నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.