సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ ప్రజలకు పారింగ్ ఇబ్బందులు లేకుండా పూర్తి ప్రణాళికను రూపొందించాలని, ఆర్గనైజింగ్ పారింగ్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ అన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ చర్చించారు. కాంప్రహెన్సివ్ పారింగ్ పాలసీ తయారు చేయుటకు అధికారులు విధివిధానాలను సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్తో పాటు భారీ వాహనాలు ఎకడెక్కడ పార్ చేయడానికి అవకాశం ఉందో అలాంటి అనువైన స్థలాలను గుర్తించాలని చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్ను ఆదేశించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే స్థలాలు గుర్తించినప్పటికీ సరైన నిర్వహణ లేకపోవడం మూలంగా పారింగ్ వినియోగించుకోవడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 4 వీలర్ పారింగ్, ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక స్థలాలు గుర్తించాలని సూచించారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో పయనించే వాహనదారులకు ఆయా ప్రాంతాల్లో వాహనదారులు పారింగ్ చేసుకునేలా అందుబాటులో ఉన్న పారింగ్ స్థలాల వివరాలు ప్రత్యేక పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా గుర్తించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కమిషనర్ సూచించారు. పారింగ్ స్థలాల వద్ద అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.
అంతేకాకుండా నగరంలో ఖాళీగా ఉన్న ప్రైవేటు స్థల యజమానులు పారింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన పక్షంలో వారు పాటించాల్సిన నియమ నిబంధనలు తయారు చేయాలన్నారు. ముఖ్యంగా మెయిన్ రోడ్డుతో పాటు ట్రాఫిక్ రద్దీగా ఉండే కాలనీ రోడ్లను గుర్తించి అనువైన స్థలాలను గుర్తించాలని పేర్కొన్నారు. ఆదే విధంగా కమర్షియల్ మాల్స్ వద్ద కూడా వాహన పారింగ్ సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పారింగ్ స్థలాల వద్ద ప్రకటనల ద్వారా జీహెచ్ఎంసీ ఆదాయం పెంచడం కోసం ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా ఏజెన్సీ పారింగ్ సంబంధించిన నిర్మాణ నమూనాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కమిషనర్ పరిశీలించారు. ఈ సమావేశంలో ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఈఎన్సీ జియా ఉద్దీన్, అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్, సీసీపీ రాజేంద్రప్రసాద్ నాయక్, ప్రాజెక్టు సీఈ దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.