హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు, సబర్బన్కు సంబందించిన మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ (ఎంఎంటీఎస్) లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 21న (ఆదివారం) రద్దు చేసినట్లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ప్రకటించారు. ఇందులో లింగంపల్లి-హైదరాబాద్ మధ్యలో 18 సర్వీసులు, ఫలక్నుమా-లింగంపల్లి స్టేషన్ల మధ్యలో 14 సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి స్టేషన్ల మధ్యలో రెండు చొప్పున మొత్తం 34 లోకల్ రైలు సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.