హైదరాబాద్: నగరంలోని బేగంపేటలో ఎంఎంటీఎస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. బేగంపేట నుంచి నెక్లెస్రోడ్డు మధ్య ఎంఎంటీఎస్ రైలు ఒక్కసారిగా నిలిచిపోయింది. సాంకేతిక లోపం వల్ల భారీ శబ్దం రావడంతో రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. అయితే వెంటనే స్పందించిన అధికారులు ఇంజిన్కు మరమ్మతులు పూర్తిచేయడంతో రైలు మళ్లీ బయల్దేరింది.