అమీర్పేట్, ఆగస్టు 11 : ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సామాజిక సేవలు ఎంతో అమూల్యమైనవని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. వరల్డ్ ఎల్డర్స్ డే వేడుకలను ఎస్ఆర్నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్లో 70 నుంచి 75 వసంతాలు పూర్తి చేసుకున్న 17 మంది సభ్యులను కౌన్సిల్ కార్యాలయ ఆవరణలో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ వయోభారంతో ఉంటున్నా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ప్రతినిధులు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. వయోధికుల సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు తన వంతు తోడ్పాటునందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిల్ అధ్యక్షుడు కాసాని సహదేవ్గౌడ్, కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు పార్థసారథి, ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, ప్రతినిధులు యాదగిరి, కృష్ణదేవ్గౌడ్, ముత్తారెడ్డి, బిచ్చప్ప, నర్సింహారెడ్డి, విఠల్రెడ్డి, రాజు, మాధవరెడ్డి, కిషన్ తదితరులున్నారు.