బోడుప్పల్, ఆగస్టు 7: ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ప్రగతి సాధిస్తున్నదని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. శనివారం బోడుప్పల్ అఖిల బ్రాహ్మణ వికాస సమితి ఆధ్వర్యంలో బ్రాహ్మణ భవన్లో ఆమెను ఘనం గా సన్మానించారు. అనంతరం మాట్లాడు తూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, మహిళలకు తగిన ప్రాధాన్యమిస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకొస్తున్నారన్నారు. బ్రాహ్మణ వికాస సమితి విజ్ఞప్తి మేరకు బ్రాహ్మణ వైకుంఠధామానికి వెయ్యి చదరపు గజాల స్థలం, నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్లు పద్మారెడ్డి, సుమన్నాయక్, కిరణ్కుమార్రెడ్డి, చీరాల నర్సింహ, కోఆప్షన్ సభ్యుడు దత్తాత్రేయ శాస్త్రి, బ్రాహ్మణ వికాస సమితి ప్రతినిధులు ప్రభు, గుర్నాథరావు, ధనుంజయ, కళ్యాణ్, జగన్నాథం, సాయిబాబా, సుధాకర్రావు, డీపీ రావు, శ్యామలరావు, జయతులసి, సాయిరాం, సుబ్బారావు, శేఖర్, లత, రాణి, పార్వతి, చలపతిరావు, సోమసుందరం పాల్గొన్నారు. అనంతరం బోడుప్పల్ టీఆర్ఎస్ ముఖ్యనాయకులతో వాణీదేవి సమావేశమయ్యారు.