MLC T Ravinder Rao : తెలంగాణ శాసన మండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు కుమారుడు దుష్యంత్ రావు వివాహానికి వెళ్లిన తెలంగాణ మంత్రులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. దుష్యంత్ రావు- శ్వేతల వివాహం బి.ఎం.ఆర్. సర్త కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి జగదీష్ రెడ్డితో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ వివాహానికి కొత్త దంపతులను ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి , ఎంపీ బడుగుల లింగయ్య నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మేల్యే ఆరూరి రమేష్, గ్యాదరి కిషోర్, సైదిరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రవీందర్ నాయక్ కూడా దుష్యంత్, శ్వేతల పెళ్లికి విచ్చేశారు. మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి , భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, ట్రైకార్ చైర్మన్ రామచంద్రు నాయక్, మాజీ శాసన సభ్యులు వీరేశం, మాజీ చైర్మన్ శ్రీ గాంధీ నాయక్, తదిరలు వివాహ వేడుకకు హాజరయ్యారు.