రవీంద్రభారతి, జూలై 25: వివిధ రంగాల్లో విశేషంగా కృషిచేసిన నిష్ణాతులైన స్త్రీమూర్తులను గౌరవించాలన్న సదుద్దేశంతో ఈ అవార్డులను నెలకొల్పడం జరిగిందని ‘అమృతలత-అపురూప’ అవార్డుల వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ అమృతలత అన్నారు. అమృతలత -అపురూప అవార్డుల ప్రదానోత్సవం-2021 కార్యక్రమం రవీంద్రభారతిలో ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణలు విచ్చేసి మాట్లాడారు.
డాక్టర్ అమృతలత వివిధ సేవా రంగాలలో పనిచేసిన పది మంది స్త్రీమూర్తులకు ‘అమృతలత-అపురూప’ అవార్డులను ప్రదానం (2021) చేయడం అభినందనీయమన్నారు. వారి సేవలను గుర్తించి అమృలత 2021 అవార్డులు అందజేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం, కసుభ సంహి తా శ్రీవన్య ఆలపించిన గేయం సభికులను ఎంతోగానో ఆకట్టుకున్నది