దుండిగల్, జూన్11: యోగాపోటీల్లో చిన్నారులు రా ణించడం అభినందనీయమని, భవిశ్యత్లో వారు జా తీయ స్థాయి పోటీల్లో పాల్గొని మెరుగైన ప్రతిభ చాటాలని ప్రభుత్వ విప్, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ఎమ్మె ల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు. గాజులరామారం సర్కిల్, సూరారం డివిజన్ పరిధిలోని షాపూర్నగర్కు చెందిన శివశక్తి ధ్యానయోగా కేం ద్రం చిన్నారులు జాశ్విన్, సాహితి, మానసలు ఇటీవల తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కేపీహెచ్బీలో నిర్వహించిన పోటీలలో పాలొన్నారు. జాశ్విన్కు గోల్డ్ మెడల్, మానస, సాహితిలు సిల్వర్ మెడల్స్ సాధించారు. ఈ నేపథ్యంలో ఆదివారం వారు తమ యోగామాస్టర్లుతో కలిసి ఎమ్మెల్సీ శంభీపూర్రాజును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.దీంతో ఎమ్మెల్సీ రాజు చిన్నారులను అభినందించి, భవిశ్యత్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో యోగా మాస్టర్లు పాల్గొన్నారు.
నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సంక్షేమసంఘా ల నేతలు,్ర పజలు, బీఆర్ఎస్ నేతలు పభుత్వ విప్, ఎమ్మె ల్సీ శంభీపూర్ రాజును ఆదివారం ఆయన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలు, బస్తీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అదే విధంగా పలు శుభకార్యాలకు హాజరు కావాలంటూ ఎమ్మెల్సీ రాజుకు పలువురు ఆహ్వానపత్రాలు అందజేశారు.