హైదారాబాద్, ఆగస్టు 19 (నమ స్తే తెలంగాణ): నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక చీరేస్తాం జాగ్ర త్త అని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని హెచ్చరించారు. బండికి దమ్ముంటే తెలంగాణకు ఏమీ చేయని కేంద్రంపై దండయాత్ర చేయాలని సవాల్ విసిరారు. పెద్దవాళ్లను తిడి తే పెద్దోణ్ని అయిపోతాననే భ్రమలో ఆయన ఉన్నారని ఎద్దేవా చేశారు.
శంభీపూర్ రాజు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బండిది టైంపాస్ యాత్ర అని అన్నారు. ఒక్క రోజైనా కులం, మతం ప్రస్తావన లేకుండా యాత్ర చేసే దమ్ములేని దద్దమ్మ అని మండిపడ్డారు. విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్న బండి.. పెరిగిన గ్యాస్, పెట్రో ధరలపై తన యాత్రలో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పసిపిల్లలు తాగే పాలపైన.. చివరికి శ్మశానవాటికల్లోనూ పన్నులేసే దుర్మార్గ కేంద్ర విధానాలపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గర పడిందన్నారు.