కాచిగూడ,మార్చి 12: ప్రజల సహకారంతో అంబర్పేట నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెలుతున్నట్లు, పెండింగ్ పనులు పరిష్కరించి, ప్రణాళికా బద్దంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నట్లు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాకల డివిజన్లోని అడ్డీ ఖర్కానా ప్రాంతంలో గురువారం రూ.7 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కాలేరు ప్రారంభించారు. అనంతరం డివిజన్లోని పలు బస్తీలలో ఎమ్మెల్యే పర్యటించి బస్తీలో నెలకొన్న స్ట్రీట్లైట్, తదితర సమస్యలను స్థానిక ప్రజల నుంచి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సంభంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ ప్రజల సహాకారంతో నియోజకవర్గంలోని అన్ని బస్తీ, కాలనీలను అభివృద్ధి చేస్తున్నట్లు, ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల సౌకర్యార్ధం కోసం నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజలు పర్యవేక్షించినప్పుడే నాణ్యమైన అభివృద్ధి పనులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్,డివిజన్ మాజీ అధ్యక్షుడు భరత్ముదిరాజ్,ఆర్కె బాబు,కాలేరు రామకృష్ణ, రెడపాక రాము, సురేశ్గౌడ్, శేషు పేరి,కాలేరు రాజు,లక్ష్మిముదిరాజ్,మహ్మాద్ మోబిన్, బాల్రాజు, అప్ప శ్రీను, యూసుప్శరీఫ్,తదితరులు పాల్గొన్నారు.