బేగంపేట్ జనవరి 22: అయోధ్యలో శ్రీ రామ మందిరం ప్రాణ ప్రతిష్ట(Prana prathista) సందర్భంగా సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Thalasani )పాల్గొన్నారు. సీతారాములకు పూజలు నిర్వహించి ఆనంతరం అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో అమీర్పేట్, సనత్నగర్, బేగంపేట్, రాంగోపాల్పేట్, మోండా మార్కెట్ డివిజన్లలో నిర్వహించిన సీతారాముల ప్రత్యేక పూజలు చేశారు.
బేగంపేట్లోని ఎస్పీ రోడ్డు హానుమాన్ దేవాలయంలో నిర్వహించిన పూజల్లో తలసాని పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమీర్పేట్ కుమ్మరి బస్తీలో తహసిల్దార్ కార్యాలయం వద్ద హనుమాన్ దేవాలయంకు నూతనంగా నిర్మించిన షెడ్డును తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహేశ్వరి, కొలన్ లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్గౌడ్, బాల్రెడ్డి, గులాబ్సింగ్, లలిత, గోపిలాల్చౌహాన్, తదితరులు పాల్గొన్నారు.