హైదరాబాద్ : శాంతి, అహింసలనే ఆయుధాలుగా చేసుకొని దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు గాంధీజీ(Gandhiji)అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్బంగా మంగళవారం ఆయన సికింద్రాబాద్లోని ఎంజీ రోడ్ లో గల గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి గాంధీజీ చేసిన సేవలు ఎంతో గొప్పవన్నారు. శాంతి, సామరస్యంతో దేనినైనా సాధించ వచ్చని ఆచరణలో చూపించారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి.మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, నామన శేషుకుమారి, కిరణ్మయి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అద్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, నాయకులు టి.శ్రీహరి, శేఖర్, సంతోష్, కిశోర్, లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, ఆంజనేయులు, మహేష్, అబ్బాస్, వాసు, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.