అమీర్పేట్, జనవరి 13 : సనత్నగర్ జెక్ కాలనీ నార్త్ రోడ్డులోని 1, 2, 3 వీధుల్లో ఆదివారం అంగడి పేరుతో కొందరు అక్రమంగా చొరబడుతూ కాలనీ ప్రశాంతత, పరిశుభ్రతలకు భంగం కలిగిస్తున్నారు. ఈ అంశాన్ని జెక్కాలనీ నివాసితుల ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మల్లు ప్రసాద్, డీఆర్ఎస్ చందులు శనివారం ఉదయం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా అంతర్గత రోడ్లలో ఆదివారాల్లో ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితులను వారు ఎమ్మెల్యేకు వివరించారు.
స్పందించిన ఎమ్మెల్యే జెక్కాలనీ నార్త్ స్ట్రీట్ 1, 2, 3 నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. కాలనీలోని స్ట్రీట్ నంబర్ 3, 4లలో వీడీసీసీ రోడ్ల పనులను కూడా త్వరగా పూర్తి అయ్యేవిధంగా చూస్తామన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి తదితరులు ఉన్నారు.