హైదరాబాద్ : ఎన్నో సంవత్సరాల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు. బుధవారం బేగంపేట (Begumpet) నాలా అభివృద్ధి పనులు, వడ్డెర బస్తీలో రోడ్ల నిర్మాణ(Road works) పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
ముఖ్యంగా వరద ముంపు సస్యకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన, నూతన రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థతో మారిన బస్తీల రూపురేఖలు మారాయని చెప్పారు.