హైదరాబాద్ : పోలియో రహిత సమాజం ఏర్పాటుకు ప్రతి ఒక్కరు పూనుకోవాలని మాజీమంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. సనత్ నగర్(Sanathnagar) నియోజకవర్గ పరిధిలోని పాన్ బజార్లో గల PHC లో చిన్నారులకు పోలియో చుక్కలు(Polio drops) వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీయో రహిత సమాజమేలక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం మొలైందని చెప్పారు.
5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి బంగారు జీవితాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి పోలియో రహిత సమాజం నిర్మించడం మనందరి బాధత్య అని పేర్కొన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఇందుకోసం గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్డు , పౌష్టికాహారం ప్రభుత్వాలు అందజేసే వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.