మన్సూరాబాద్, మార్చి 20 : ఆలయాల అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తానని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు. బుధవారం నాగోల్ డివిజన్ పరిధి బాలాజీనగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శివ ఆంజనేయస్వామి సహిత రామాలయం(Temple) భూమి పూజ(Bhumi Pooja) కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు, నాయకులు పాల్గొన్నారు.