ఉప్పల్, జూలై 10 : అభివృద్ధి, సంక్షేమమే ధ్వేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ‘మీ కోసం మీ ఎమ్మెల్యే పాదయాత్ర’ లో భాగంగా సోమవారం చిలుకానగర్ డివిజన్లోని కాలనీల్లో ఆయన పర్యటించారు. ఈ మేరకు తెలంగాణ తల్లి విగ్రహం నుంచి న్యూరాంనగర్, కుమ్మరికుం ట, ఆదర్శనగర్, ఆనంద్నగర్, వెంకటేశ్వరకాలనీలో పాదయాత్ర చేపట్టి.. సమస్యలు తెలుసుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ కాలనీవాసుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ, తాగునీరు, లోప్రెషర్, విద్యుత్ స్తంభాల ఆధునీ కరణ, వీధిదీపాలు, సీసీ రోడ్లు, విద్యుత్, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలపై కాలనీవాసులు ఎమ్మెల్యేకు వినతిపత్రాలు సమర్పించారు. ప్రధాన సమస్యలకు ప్రణాళికలు సిద్ధం చేయిస్తూ, చిరు సమస్యలను వెంటనే పరిష్కరించేవిధంగా ఎమ్మెల్యే చర్యలు చేపట్టారు. అధికారులకు పలు సూచనలు చేస్తూ, గతంలో వచ్చిన స మస్యలపై ఆరా తీస్తూ ముందుకు సాగారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ముందుకుసాగుతున్నారు.
అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు
గతంలో అధికారంలో ఉండి ఏమి చేయలేని పార్టీలు విమర్శించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అ న్నారు. చెరువులు కాపాడలేని కాంగ్రెస్ నేతలు, వరదలు అరికట్టలేని ప్రభుత్వాలు నేడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాలనీల ముంపునకు కారణమైనవారే ముంపు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నా రు. కాంగ్రెస్పార్టీ నేతలు ఈ రోజు ఖాళీ బిందెలు పట్టుకొని నిరసనలు చేస్తుంటే… మహిళలు నవ్వుతున్నారని అన్నారు. ఉప్పల్ ప్రాంతానికి రూ.60 కోట్ల నిధులను నీటి పైపులైన్ల కోసం తీసుకు వచ్చామన్నారు. ఉప్పల్ కారిడార్ పనులు చేపట్టలేని బీజేపీ నేతలు, నిరసన యాత్రలు చేయడం సిగ్గు చేటన్నారు. కారిడార్కు అదనంగా నిర్మించడానికి రూ.311కోట్లు నిధులు అందించడం, ల్యాండ్ సేకరణ కోసం రూ.2వేల కోట్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. ఉప్పల్ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధిని చేశామన్నారు.
గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి, సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందన్నారు. నియోజకవర్గ అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తూ, అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని , నీటి సమస్యలు లేని నియోజకవర్గాన్ని తీసుకువచ్చామన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు గుండారపు శ్రీనివాస్రెడ్డి, సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పల్లె నర్సింగ్రావు, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్, లేతాకుల రఘుపతిరెడ్డి, గుడి మధుసూదన్రెడ్డి, కాసం మహిపాల్రెడ్డి, భాస్కర్, జల్లి మోహన్, పిట్టల నరేశ్, మేకల మధుసూదన్ రెడ్డి, వేముల సంతోష్రెడ్డి, చింతల నర్సింహారెడ్డి, వీబీ నర్సింహా, ఈరెల్లి రవీందర్రెడ్డి, కొంపె ల్లి రవీందర్, రాజ్కుమార్, ఆకిటి బాల్రెడ్డి, నర్సింగ్రా వు, రామచర్ల బలరాం, సాయిలు, పురుషోత్తంరెడ్డి, వేము ల పరమేశ్, రాంచందర్, పోచయ్య, అల్లిబిల్లి మహేందర్, మహేందర్రెడ్డి, గిరిబాబు, పల్ల కిరణ్కుమార్రెడ్డి, మేకల ముత్యంరెడ్డి, డా.బీవీచారి, ఎండి ముస్తాక్ పాల్గొన్నారు.