కంటోన్మెంట్, జూలై 26 : రాష్ట్రంలోని పేదలందరూ మూడు పూటలా కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులను అందిస్తున్నారని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. న్యూబోయిన్పల్లి చిన్న తోకట్టలోని సెవన్ టెంపుల్ సమీపంలో సోమవారం లబ్ధిదారులకు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కొత్త రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి రేషన్కార్డును అందిస్తున్నామని వెల్లడించారు. కంటోన్మెంట్ పరిధిలో సుమారు 4వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారని ప్రస్తుతం 15వందలకు పైగా రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా దళితుల అభివృద్ధి కోసం ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చే పథకం ప్రవేశపెట్టామని త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఓ చాముండేశ్వరీ, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, పాండుయాదవ్, శ్యాంకుమార్, నళినికిరణ్, లోక్నాథంతో పాటు మార్కెట్ డైరెక్టర్ అరుణ్యాదవ్, నేతలు ప్రభుగుప్తా, మీనా భాస్కర్, పిట్ల నగేష్, నివేదిత తదితరులు పాల్గొన్నారు.